BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
25 Jun, 2026 - 02:48 PM
10 వీక్షణలు

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తాం

అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక

ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్

అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు  ఆలోచన. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది పవిత్ర భూమి. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.