పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ
పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ
పల్నాడు జిల్లాలోని గుర్తింపు పొందిన (అక్రిడిటేటెడ్) జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (APUWJ) పల్నాడు జిల్లా కమిటీ ఇచ్చిన వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన ఆమె, జూన్ 25న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను, మానవతా దృక్పథంతో ఈ ఫీజు రాయితీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లను కోరారు. ఈ ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి (DEO)తో పాటు జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులందరికీ (MEOs) కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.