BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

జులై 1 నుంచి ఈ-రవాణా విధానం అమలు.. మాన్యువల్ పర్మిట్లకు స్వస్తి: ఏపీ రవీంద్ర

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:45 PM
19 వీక్షణలు

కడప జిల్లా మైదుకూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఏపీ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ-రవాణా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జులై 1వ తేదీ నుంచి చెక్‌పోస్టుల వద్ద నగదు వసూలు చేసి రసీదులు జారీ చేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ లైసెన్స్ కలిగిన వ్యాపారులు స్వయంగా ఆన్‌లైన్‌లో ఈ-రసీదు లేదా పర్మిట్ పొందించి, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే వాహనదారులకు అందజేసి పంపాలని కోరారు. మార్కెట్ యార్డుల ఆదాయాలను పెంచడం, పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వ్యవసాయ, వాణిజ్య పంటల రవాణాకు అధికారులు మాన్యువల్ పద్ధతిలో పర్మిట్లు జారీ చేసేవారని, ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్ ద్వారానే పర్మిట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ-రవాణా విధానం అమలుతో అక్రమాలు, లోపాలకు అడ్డుకట్ట పడటంతో పాటు చెక్‌పోస్టుల వద్ద అవకతవకలు తగ్గుతాయని చెప్పారు.

ట్రేడ్ లైసెన్సులు లేకుండా లేదా సరైన పర్మిట్లు లేకుండా సరుకుల రవాణా చేసే వారు చెక్‌పోస్టు సిబ్బందిని తప్పుదారి పట్టించే అవకాశాలను నివారించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి సెస్ రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైదుకూరు మార్కెట్ యార్డు సిబ్బంది, రైస్ మిల్ యజమానులు, విత్తన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.