విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి
పదో తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతుల పంపిణీ చేసిన కొరివి వెంకన్న
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు కొరివి వెంకన్న పిలుపునిచ్చారు. చిట్యాల పురపాలిక పరిధిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల అధ్యక్షతన పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొరివి వెంకన్న నగదు బహుమతులు అందజేశారు. నగదు బహుమతులు అందుకున్న వారిలో ప్రథమ స్థానం గండవరం సంకీర్తన
ద్వితీయ స్థానం లో ఎండి. షాహిన్
తృతీయ స్థానంలో మంద శ్రీవాణి ఉన్నారు విద్యార్థుల బాధ్యతను మరింత పెంచాయని కొరివి వెంకన్న పేర్కొనగా, బహుమతి మొత్తాన్ని వృథా చేయకుండా పుస్తకాల కొనుగోలుకు, జ్ఞానాన్ని పెంచే పనులకు ఉపయోగించాలని ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల హితవు పలికారు. దాత కొరివి వెంకన్నను పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు బూరుగు కృష్ణయ్య, పాలాది రమేష్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.