BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు.. 38 కత్తిపోట్లతో నలుగురి హత్య!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:42 AM
56 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11) మృతదేహాలపై నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో వీరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది.

నివేదిక ప్రకారం సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు, హసీనాకు 7 కత్తిపోట్లు, అక్సరకు 9 కత్తిపోట్లు ఉండగా, ముజమిల్‌పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 38 కత్తిపోట్లతో నలుగురినీ హతమార్చినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ హత్యలను ప్రొఫెషనల్ కిల్లర్లే చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు నిందితులకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపగా, కుటుంబ సభ్యులను ఇంత క్రూరంగా హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.