BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు.. 38 కత్తిపోట్లతో నలుగురి హత్య!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:42 AM
137 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11) మృతదేహాలపై నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో వీరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది.

నివేదిక ప్రకారం సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు, హసీనాకు 7 కత్తిపోట్లు, అక్సరకు 9 కత్తిపోట్లు ఉండగా, ముజమిల్‌పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 38 కత్తిపోట్లతో నలుగురినీ హతమార్చినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ హత్యలను ప్రొఫెషనల్ కిల్లర్లే చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు నిందితులకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపగా, కుటుంబ సభ్యులను ఇంత క్రూరంగా హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.