BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

విద్యార్థుల కొరతతో 167 ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:44 AM
32 వీక్షణలు

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 167 ప్రభుత్వ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో వరంగల్ జిల్లాలో 131, హనుమకొండ జిల్లాలో 36 పాఠశాలలు ఉన్నాయి.

నెక్కొండ మండలంలో అత్యధికంగా 28 పాఠశాలలు మూతపడుతుండగా, చెన్నారావుపేట మరియు రాయపర్తి మండలాల్లో చెరో 16 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి తగ్గడం, ప్రైవేట్ విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీసినట్లు భావిస్తున్నారు.

ఒకేసారి 167 పాఠశాలలు మూతపడుతుండటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందుబాటుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.