BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విద్యార్థుల కొరతతో 167 ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:44 AM
126 వీక్షణలు

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 167 ప్రభుత్వ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో వరంగల్ జిల్లాలో 131, హనుమకొండ జిల్లాలో 36 పాఠశాలలు ఉన్నాయి.

నెక్కొండ మండలంలో అత్యధికంగా 28 పాఠశాలలు మూతపడుతుండగా, చెన్నారావుపేట మరియు రాయపర్తి మండలాల్లో చెరో 16 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి తగ్గడం, ప్రైవేట్ విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీసినట్లు భావిస్తున్నారు.

ఒకేసారి 167 పాఠశాలలు మూతపడుతుండటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందుబాటుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.