BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

విద్యార్థుల కొరతతో 167 ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:44 AM
97 వీక్షణలు

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 167 ప్రభుత్వ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో వరంగల్ జిల్లాలో 131, హనుమకొండ జిల్లాలో 36 పాఠశాలలు ఉన్నాయి.

నెక్కొండ మండలంలో అత్యధికంగా 28 పాఠశాలలు మూతపడుతుండగా, చెన్నారావుపేట మరియు రాయపర్తి మండలాల్లో చెరో 16 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి తగ్గడం, ప్రైవేట్ విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీసినట్లు భావిస్తున్నారు.

ఒకేసారి 167 పాఠశాలలు మూతపడుతుండటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందుబాటుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.