ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు బుధవారం స్థానిక బి.ఆర్. ఫంక్షన్ హాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చిట్యాల తహసిల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగ తహసిల్దార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, అధికారులకు సహకరించాలని కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.ఇ.ఆర్.ఓ తహసీల్దార్ విజయ్ కుమార్, ఈ శిక్షణా కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ సి.పి.ఎం,పాల్గొన్నారు బి.జె.పి తదితర ప్రధాన రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ఆయా పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు