కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్
నల్గొండ జిల్లా చిట్యాల లోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సాగిస్తున్న అధిక ఫీజుల దోపిడీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను సేవగా కాకుండా లాభార్జనే ధ్యేయంగా వ్యాపారంగా మార్చేశాయని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోయలేని రీతిలో అధిక ఫీజుల భారం మోపడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, విద్యను లాభాల వ్యాపారంగా మార్చిన శ్రీ చైతన్య యాజమాన్యం తన దోపిడీ విధానాలను వెంటనే మార్చుకోవాలి అని. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ఈ అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు శ్రీశాంత్, రాము, సతీష్లతో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.