BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Jun, 2026 - 06:58 PM
206 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల లోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సాగిస్తున్న అధిక ఫీజుల దోపిడీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను సేవగా కాకుండా లాభార్జనే ధ్యేయంగా వ్యాపారంగా మార్చేశాయని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోయలేని రీతిలో అధిక ఫీజుల భారం మోపడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, విద్యను లాభాల వ్యాపారంగా మార్చిన శ్రీ చైతన్య యాజమాన్యం తన దోపిడీ విధానాలను వెంటనే మార్చుకోవాలి అని. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ఈ అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. డిమాండ్ చేశారు.  ​ఈ నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, సభ్యులు శ్రీశాంత్, రాము, సతీష్‌లతో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.