జిల్లాలో 32 తాత్కాలిక గురుకుల టీచర్ పోస్టుల భర్తీ
మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 32 తాత్కాలిక ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు (బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు స్త్రీలు మాత్రమే అర్హులు). విద్యా అర్హతల విషయానికొస్తే.. జూనియర్ లెక్చరర్ (JL), పీజీటీ (PGT) పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ డిగ్రీతో పాటు బి.ఎడ్ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ (TGT) పోస్టులకు కనీసం 50% మార్కులతో డిగ్రీ (B.Sc/BA/B.Com) మరియు బి.ఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో జూన్ 27న (శనివారం) లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు ధృవపత్రాల పరిశీలన, అనంతరం డెమో (తరగతి బోధన) ఉంటుందని జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి కోటూరి రామకల్యాణి తెలిపారు. ఇతర వివరాలకు 9704550167 నంబరును సంప్రదించవచ్చు