మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
మంచిర్యాల :విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, సమాజంలో ఇతరులను కూడా చైతన్యపరచాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున గుడిపేట మెడికల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన మరియు వాటి దుష్ప్రభావాల పట్ల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల పట్ల యువత అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ రవీందర్, ఎస్సై కిరణ్, ఎక్సైజ్ డిఎస్పి రాంరెడ్డి, దేవ రావుఫ్ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు