BREAKING
రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం
www.ntodaynews.com

శింగణమలలో వైఎస్సార్సీపీ జోరు.. టీడీపీకి షాక్

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 07:32 PM
21 వీక్షణలు

అనంతపురం జిల్లా శింగణమల నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సింగణమల మండలం రాచేపల్లి గ్రామానికి చెందిన 13 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ చేరికలు జరిగినట్లు నాయకులు తెలిపారు.

మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ నేతృత్వంలో, యువ నాయకుడు డాక్టర్ రుత్విక్ సమక్షంలో, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శి గోకుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడిగా ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో వైఎస్సార్సీపీ పాత్రను గుర్తించి పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

రానున్న రోజుల్లో శింగణమల నియోజకవర్గంలో మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.