www.ntodaynews.com
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్
/
కర్నూలు
కర్నూలు: జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మైనింగ్ ప్రాంతంలో భారీ వాహనాల నిర్వహణకు మహిళలు, యువతకు శిక్షణ ఇస్తున్న సిమ్యులేటర్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జెండా ఊపి ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలను ప్రారంభించారు.
రూ.405 కోట్ల పెట్టుబడితో జొన్నగిరిలో బంగారం తవ్వకాల ప్రాజెక్టును Geomysore Services, Deccan Gold Mines సంస్థలు చేపట్టనున్నాయి. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో ఏడాదికి 400 కిలోల బంగారం ఉత్పత్తి చేసి, తరువాత 900 కిలోలకు, అనంతరం 2 టన్నుల వరకు ఉత్పత్తి పెంచే లక్ష్యాన్ని నిర్దేశించాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టి.జి. భరత్ తదితరులు పాల్గొన్నారు.