BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన వైరల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:41 AM
96 వీక్షణలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర నుంచి ఖమ్మం వెళ్తుండగా వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో ఓ కుటుంబం బస్సు ఎక్కింది. ఈ సమయంలో ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ సీటు కోసం ఇతర మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది.

మాటామాటా పెరగడంతో వివాదం తీవ్రరూపం దాల్చి మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఈ ఘటనతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని, సీట్ల కోసం తరచూ ఇలాంటి వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.