BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

నూజివీడు బైపాస్ పనులు వేగవంతం చేస్తామని హామీ.. మంత్రిని సన్మానించిన రైతులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:45 PM
123 వీక్షణలు

నూజివీడు పట్టణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డును కలుపుతూ ప్రతిపాదిత బైపాస్ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, భూములు కోల్పోయిన రైతులకు రావలసిన పరిహార నిధులను వెంటనే విడుదల చేయిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

ఈ నేపథ్యంలో బైపాస్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఏనుగుల వెంకటేశ్వరరావు, లాయర్ కుమార్, గోళ్ల వాసు, గోళ్ల వెంకటేష్, పిట్ల రాజా, చిట్టూరి సోమశేఖర్, ఏనుగుల చక్రి తదితరులు గురువారం మంత్రి కొలుసు పార్థసారథిని ఆయన స్వగృహంలో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా బైపాస్ నిర్మాణం పూర్తయితే నూజివీడు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.