BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
02 May, 2026 - 02:13 PM
102 వీక్షణలు

అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం

అనకాపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ వారు మరియు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ , డీఎస్పీ మోహన్ రావు , డి.ఎస్.పి శ్రావణి, మరియు జిల్లా అధికారులతో కలిసి అనకాపల్లి పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.

ఆకస్మిక తనిఖీ: జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు అనకాపల్లి  లోని , జలగల మధుo వద్ద ఉన్న శ్రీ శివరామ ఏజెన్సీస్  పెట్రోలియం  బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 పెట్రోల్ బంకులో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ నిల్వలపై యజమానిని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని నిర్ధారించుకున్నారు.

ఈ పర్యటనలో ఆయిల్ కంపెనీ యజమానులు, రెవెన్యూ సిబ్బంది. పోలీసు వారు పాల్గొని ప్రస్తుత డిమాండ్ మరియు సరఫరా గొలుసు  గురించి వివరించారు.

ప్రజలకు జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ సంయుక్తంగా ప్రజలకు ఈ క్రింది సూచనలు చేశారు.

 చరవాణి ఆధారంగా సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ కొరత వార్తలు కేవలం వదంతులే. వాటిని నమ్మి ఆందోళన చెందవద్దు.

జిల్లా ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ కంపెనీల నుండి నిరంతరం సరఫరా జరుగుతోంది.

డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో ట్యాంకులు నింపుకోవద్దు. మీ నిత్య అవసరాలకు ఎంత కావాలో అంత మాత్రమే కొనుగోలు చేయండి.

తప్పు తోవ పట్టే విధంగా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా వదంతులు వ్యాప్తి చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది

జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది. ఇంధన సరఫరాలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు.అని కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు.