www.ntodaynews.com
అసెంబ్లీలో కట్లేరు బ్రిడ్జి సమస్యపై గళమెత్తిన ఎమ్మెల్యే కొలికపూడి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని ప్రతిష్టాత్మక కట్లేరు బ్రిడ్జి నిర్మాణ సమస్యపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తిరువూరు, గంపలగూడెం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
కట్లేరు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే లక్షలాది మంది రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజల చిరకాల స్వప్నమైన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.