అయ్యప్పరాజుగూడెంలో కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్ట మహోత్సవం....
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
అయ్యప్పరాజుగూడెంలో కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్ట మహోత్సవం.. పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామంలో ఆదివారం కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్), చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, ఏలూరు పార్టీ ఇన్చార్జి జయప్రకాష్, లింగపాలెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నపునేని శాంతారావు, మండల యువజన విభాగం అధ్యక్షులు చిదరాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.