www.ntodaynews.com
బెల్జియంలో తవ్వకాల్లో రూ.98 కోట్ల విలువైన బంగారం లభ్యం
అంతర్జాతీయం
బెల్జియంలో తవ్వకాల్లో రూ.98 కోట్ల విలువైన బంగారం లభ్యం
బెల్జియంలో ఓ ఇంటి పునరుద్ధరణ పనులు చేపడుతున్న నిర్మాణ కార్మికులకు భారీ నిధి లభించింది. మురుగునీటి పైపులు ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు జరుపుతుండగా భూమిలో దాచిన బంగారు కడ్డీలు, నాణేలు బయటపడ్డాయి.
ఈ బంగారం విలువ సుమారు రూ.98 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, బంగారాన్ని భద్రపరిచారు.
నిధి కోసం అనుమతులు లేకుండా ఎవరైనా ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.