చేనేత భవన స్థల పరిశీలన
చేనేత భవన స్థల పరిశీలన
నల్గొండ జిల్లా చిట్యాల చేనేత సహకార పరపతి సంఘం భవన నిర్మాణానికి సంబంధించి సోమవారం సంఘ పాలకవర్గం, పట్టణ కుల పెద్దలు స్థలాన్ని పరిశీలించారు. చిట్యాల పాల కేంద్రం ఎదురుగా ఉన్న చేనేత సహకార సంఘం స్థలం వద్దకు చేరుకున్న నాయకులు, గతంలో నాటిన కడీలను, అప్పటి కలెక్టర్ దయాచారి వేసిన శంకుస్థాపన రాయి ను పరిశీలించారు. ఈ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని, నిర్మాణ అంచనాల తయారీకి స్థానిక ఏఈని కూడా ఆదేశించారని ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు గుర్తుచేశారు. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో భవన నిర్మాణం
ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో పాటు, దాతల ఉదార సహకారంతో భవన నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చేనేత సహకార సంఘం చైర్మన్ గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, కోశాధికారి కోట రాంబాబు, డైరెక్టర్లు మిర్యాల ప్రకాశ్, వడ్డేపల్లి రాములు మరియు పట్టణ కుల పెద్దలు జెల్లా మనోహర్, గంజి వెంకటేశం, జెల్లా సత్తయ్య, గంజి కనకయ్య, సంగిశెట్టి మనోహర్, గంజి గోవర్ధన్, తడక మురళి, గుజ్జరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.