www.ntodaynews.com
చనుబండలో విద్యుత్ షాక్తో రైతు మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చనుబండలో విద్యుత్ షాక్తో రైతు మృతి
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన రైతు చిన్నం లక్ష్మీనారాయణ (45) శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై ఆకస్మికంగా మృతిచెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చిన్నం లక్ష్మీనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇక పోలీసులు, వీఆర్వోలు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.