www.ntodaynews.com
చేబ్రోలు విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా .
తెలంగాణ
చేబ్రోలు విద్యుత్ కోతలకు నిరసన గా ధర్నా
NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రతినిధి. బోరా శివ రెడ్డి .
సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం రాత్రి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. గడిచిన కొన్ని రోజులుగా గ్రామంలో కరెంట్ తీసివేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు సబ్ స్టేషన్ ముట్టడించి ధర్నాకు దిగారు. విద్యుత్ కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని విద్యుత్ శాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇతర సిబ్బంది ప్రజలకు నచ్చ చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో చేదులూరి నాగబాబు, సూరిశెట్టి జై కృష్ణ, పెద్దింటి శివ, సకినాల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube