BREAKING
రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం
www.ntodaynews.com

​సీఐటీయు నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు నేతలపై బహిష్కరణ వేటు

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 04:36 PM
90 వీక్షణలు

​వేరొక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినందుకే చర్యలు

​వారితో సీఐటీయుకు ఎలాంటి సంబంధం లేదు

​జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శుల ప్రకటన

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో బుధవారం సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. సంఘం నిర్మాణ పద్ధతులకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురు నాయకులను సీఐటీయు నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులైన సంకె రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాసిపేట రాజేశం, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గట్టు మహేందర్ ఇటీవల వేరొక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, అందులో కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు పత్రికల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది సీఐటీయు పని పద్ధతులకు పూర్తిగా విరుద్ధం కావడంతో జిల్లా కమిటీ నిర్ణయం మేరకు వారిపై బహిష్కరణ వేటు వేశామని స్పష్టం చేశారు.

​బహిష్కరణకు గురైన ఈ ఐదుగురు నాయకులతో నేటి నుంచి సీఐటీయుకు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని సీఐటీయులో ఉన్న కార్మికులు, అనుబంధ యూనియన్లు, జిల్లాలోని ఇతర కార్మిక సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు గమనించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షురాలు సమ్మక్క, జిల్లా సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, భానుమతి, జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రకాష్, సి. దేవదాసు, ఏ. లక్ష్మణ్, ఏ. మౌలాలి, డి. రాజారాం తదితరులు పాల్గొన్నారు