BREAKING
మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
www.ntodaynews.com

ధర్మపురిలో ఘనంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
24 Jun, 2026 - 12:35 PM
11 వీక్షణలు

ధర్మపురిలో ఘనంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేసిన ధర్మపురి మునిసిపల్ చైర్మన్ వేముల నాగ లక్ష్మి 

​ధర్మపురి, జూన్ 24:

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు. బుధవారం పట్టణంలోని 5వ వార్డు అంగన్వాడి పాఠశాలలో చిన్నారులకు యూనిఫాంలు, అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఆమె పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అవసరమైన అన్ని సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్యా సామగ్రిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంగన్వాడి చిన్నారులకు యూనిఫాంలు అందించడం ద్వారా వారిలో విద్యాభ్యాసంపై ఆసక్తి పెరుగుతుందని, అదేవిధంగా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందజేయడం వల్ల కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.