వార్డుల అభివృద్ధే ధ్యేయం: మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి
వార్డుల అభివృద్ధే ధ్యేయం: మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి, జూన్ 24:
ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి స్పష్టం చేశారు. పట్టణంలోని 1వ వార్డులో రూ.17 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు మరియు పారిశుద్ధ్య సమస్యలు లేని వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని వార్డుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆమె వివరించారు. ఈ పనులు పూర్తయితే స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగడమే కాకుండా, పారిశుద్ధ్య సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని చైర్పర్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు అయ్యోరి వేణుగోపాల్, ముడుసుల ప్రశాంత్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.