BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ప్రజాపాలనకు ప్రత్యక్ష నిదర్శనం 'ఇందిరమ్మ ఇళ్లు': మేయర్ దర్ని మధుకర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 04:32 PM
194 వీక్షణలు

​తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతోంది. ఇందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో లబ్ధిదారులైన కటకం రజిత-సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల నగర మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విచ్చేసిన మేయర్ గారిని లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో ఘనంగా సన్మానించారు.

​ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు ఎంత వేగంగా చేరుతాయో చెప్పడానికి పూర్తి కావస్తున్న ఈ ఇందిరమ్మ గృహాలే ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సహకారం, అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అధ్యక్షులు గోపతి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు