BREAKING
మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం
www.ntodaynews.com

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్

తెలంగాణ
/ నల్గొండ / కేతేపల్లి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
09 May, 2026 - 02:36 PM
122 వీక్షణలు

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ NTODAY NEWS కేతపల్లి

కొర్లపహాడ్ వద్ద భారీగా గంజాయి తరలిస్తున్న లారీ సీజ్

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో శనివారం భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. పోలీసుల అప్రమత్తతతో అక్రమంగా తరలిస్తున్న ఈ మాదకద్రవ్యాల గుట్టు రట్టయింది. ​శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద కేతేపల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక  లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని ఆపి సోదా చేశారు. లారీలో తనిఖీ చేయగా భారీగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ

​తనిఖీలకు  సంబంధించి కేతేపల్లి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెద్ద శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి,  గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్ఐ సతీష్ ప్రజలను కోరారు.