BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మంచిర్యాలలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత: ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేత విజిత్ కుమార్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 04:44 PM
94 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మార్కెట్ ఏరియాలో మున్సిపల్ అధికారులు, పోలీసులు అకస్మాత్తుగా చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్య చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని మల్లేశ్ అనే స్థానిక వ్యాపారి కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఏళ్లుగా అదే స్థలంలో వ్యాపారం చేసుకుంటూ పొట్టతిప్పలు పడుతున్నామని, స్థల యజమాని అనుమతి ఉన్నప్పటికీ తమ జీవనాధారాన్ని దెబ్బతీశారని, ఈ ప్రక్రియలో లక్షలాది రూపాయల విలువైన సామాగ్రి నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే తమను ఆదుకోవాలని కోరారు.

​మరోవైపు ఈ అకస్మాత్తు కూల్చివేతలపై బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రోద్బలంతోనే అధికారులు ఈ అనాలోచిత చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన ఆయన, సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, బాధితుల పక్షాన అవసరమైతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని విజిత్ కుమార్ అధికారులను హెచ్చరించారు