BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాలలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత: ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేత విజిత్ కుమార్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 04:44 PM
127 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మార్కెట్ ఏరియాలో మున్సిపల్ అధికారులు, పోలీసులు అకస్మాత్తుగా చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్య చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని మల్లేశ్ అనే స్థానిక వ్యాపారి కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఏళ్లుగా అదే స్థలంలో వ్యాపారం చేసుకుంటూ పొట్టతిప్పలు పడుతున్నామని, స్థల యజమాని అనుమతి ఉన్నప్పటికీ తమ జీవనాధారాన్ని దెబ్బతీశారని, ఈ ప్రక్రియలో లక్షలాది రూపాయల విలువైన సామాగ్రి నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే తమను ఆదుకోవాలని కోరారు.

​మరోవైపు ఈ అకస్మాత్తు కూల్చివేతలపై బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రోద్బలంతోనే అధికారులు ఈ అనాలోచిత చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన ఆయన, సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, బాధితుల పక్షాన అవసరమైతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని విజిత్ కుమార్ అధికారులను హెచ్చరించారు