పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు
తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన తొర్రూరు V6 రిపోర్టర్ పులి సతీష్ గారి నానమ్మ శ్రీమతి పులి సాయమ్మ గారు ఇటీవల మృతిచెందిన విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సాయమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయమ్మ గారి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, మండల పట్టణ సీనియర్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.