www.ntodaynews.com
తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల జీవిత బీమా
తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ జీవిత బీమా పథకాన్ని తీసుకురానుంది. ఎలాంటి ప్రీమియం, చెల్లింపులు లేదా విరాళాలు లేకుండానే రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. సహజ మరణం, ప్రమాద మరణం జరిగిన సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది.
ఈ పథకాన్ని జూన్ 25న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనుంది.
ఈ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు, యూనియన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని టీజీఈజేఏసీ పిలుపునిచ్చింది.