BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

ఏపీలో బంగారు గని ఉత్పత్తికి శ్రీకారం.. జొన్నగిరిలో రేపు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:14 PM
12 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌ గనుల చరిత్రలో కీలక ఘట్టానికి తెరలేవనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బంగారు గనుల ప్రాజెక్టు రేపటి నుంచి ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ఖనిజ రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో నిర్వహించిన అన్వేషణల్లో బంగారు నిల్వలు గుర్తించబడటంతో ప్రయోగాత్మక తవ్వకాలు విజయవంతమయ్యాయి. దీంతో పూర్తిస్థాయి బంగారం ఉత్పత్తికి సంస్థలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖనిజ రంగానికి ఊతం లభించనుంది.

అదే ప్రాంతంలో అదనపు తవ్వకాల కోసం కొత్త విస్తీర్ణంలో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో ప్రాసెసింగ్‌ యూనిట్‌కు కూడా సీఎం భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో చేరనుంది.

గతంలో జొన్నగిరి పరిసర ప్రాంతాలు వజ్రాల లభ్యతతో ప్రసిద్ధి చెందగా, ఇప్పుడు బంగారు నిల్వలతో మరోసారి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాయలసీమ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.