www.ntodaynews.com
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కీలక ముందడుగు
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు కీలక ముందడుగు పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమవడంతో ఫేజ్-2 విస్తరణతో పాటు ఫేజ్-1 స్వాధీన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెంట్గా నియమించాలని నిర్ణయించారు. మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ, ప్రభుత్వ టేకోవర్ విధానం, అలాగే ఫేజ్-2 విస్తరణ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రుణ సదుపాయాలపై సమగ్ర నివేదికను సంస్థ సిద్ధం చేయనుంది.
ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అనుమతులు, నిధుల విడుదల, విస్తరణ పనుల అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు మరింత వేగం వచ్చే అవకాశం కనిపిస్తోంది.