www.ntodaynews.com
తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తా: కిషన్ రెడ్డి
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను పనిచేస్తానని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు రెండు లేఖలు రాశారని గుర్తుచేసిన ఆయన, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం భేటీకి తానే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం కూడా చేశానన్నారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ అంశంపై సానుకూల చర్చలు జరిగాయని, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వాటి సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.