BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విద్యుత్ షాక్‌తో గాయపడిన వానరం మృతి.. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖననం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:20 PM
57 వీక్షణలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఓ వానరం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలోని అశోక్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగలడంతో వానరం మూడు అంతస్తుల భవనం పై నుంచి కిందపడిపోయింది.

సమాచారం అందుకున్న హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వానరానికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పొద్దుటూరుకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే వానరం మృతి చెందినట్లు తెలిపారు.

మృతి చెందిన వానరాన్ని తాడిపత్రి కొత్త బ్రిడ్జి సమీపంలోని పెన్నా నది తీరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ మూగజీవాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు, ఇతర ప్రమాదకర పరిస్థితుల కారణంగా జంతువులు ప్రాణాలు కోల్పోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోతుల గంగాధర్ యాదవ్, అనంత శివారెడ్డి, కృష్ణ మోహన్ రాజు, జంతు ప్రేమికుడు ఇస్మాయిల్, రోటరీ క్లబ్ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొని వానరానికి నివాళులర్పించారు.