BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

విద్యుత్ షాక్‌తో గాయపడిన వానరం మృతి.. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖననం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:20 PM
13 వీక్షణలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఓ వానరం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలోని అశోక్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగలడంతో వానరం మూడు అంతస్తుల భవనం పై నుంచి కిందపడిపోయింది.

సమాచారం అందుకున్న హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వానరానికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పొద్దుటూరుకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే వానరం మృతి చెందినట్లు తెలిపారు.

మృతి చెందిన వానరాన్ని తాడిపత్రి కొత్త బ్రిడ్జి సమీపంలోని పెన్నా నది తీరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ మూగజీవాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు, ఇతర ప్రమాదకర పరిస్థితుల కారణంగా జంతువులు ప్రాణాలు కోల్పోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోతుల గంగాధర్ యాదవ్, అనంత శివారెడ్డి, కృష్ణ మోహన్ రాజు, జంతు ప్రేమికుడు ఇస్మాయిల్, రోటరీ క్లబ్ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొని వానరానికి నివాళులర్పించారు.