కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వ్యవహారంలో మరో కీలక మలుపు
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజుపై మరోసారి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ ఆయన బినామీగా మారిన బావ తోరం రాము పేరిట ఉన్నట్లు విచారణలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాము ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులకు యజమానిగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పేరిట విలాసవంతమైన భవనాలు, ఆక్వా వ్యాపారాలు, భూములు, ఎగుమతి సంస్థలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
ఆరోపణల ప్రకారం..
కోనసీమ జిల్లా అలాపురం గారపాటి వీధిలో రూ.4 కోట్ల విలువైన భవనం
నాగరాజు స్వగ్రామం చెయ్యేరులో రూ.3 కోట్ల భవనం, 25 ఎకరాల వ్యవసాయ భూమి
మహిపాల చెరువు గ్రామంలో రూ.10 కోట్ల విలువైన రొయ్యల మేత కంపెనీ
భీమవరంలో రొయ్యల ఎగుమతి సంస్థ
నేదునూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు
బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల భూమి
విజయవాడ మద్యం సిండికేట్లో వాటా
ఒంగోలులో హేచరీ
అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు సంస్థలు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.