BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వ్యవహారంలో మరో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:19 PM
88 వీక్షణలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజుపై మరోసారి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ ఆయన బినామీగా మారిన బావ తోరం రాము పేరిట ఉన్నట్లు విచారణలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాము ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులకు యజమానిగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పేరిట విలాసవంతమైన భవనాలు, ఆక్వా వ్యాపారాలు, భూములు, ఎగుమతి సంస్థలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఆరోపణల ప్రకారం..

కోనసీమ జిల్లా అలాపురం గారపాటి వీధిలో రూ.4 కోట్ల విలువైన భవనం

నాగరాజు స్వగ్రామం చెయ్యేరులో రూ.3 కోట్ల భవనం, 25 ఎకరాల వ్యవసాయ భూమి

మహిపాల చెరువు గ్రామంలో రూ.10 కోట్ల విలువైన రొయ్యల మేత కంపెనీ

భీమవరంలో రొయ్యల ఎగుమతి సంస్థ

నేదునూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు

బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల భూమి

విజయవాడ మద్యం సిండికేట్‌లో వాటా

ఒంగోలులో హేచరీ

అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు సంస్థలు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.