ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి.. చేనేత అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గంజి సుధాకర్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రముఖ చేనేత ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన, ఆధునిక డిజైన్లతో కూడిన చేనేత వస్త్రాలను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రభుత్వం, సహకార సంఘాలు, చేనేత కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్, కోశాధికారి కోట దయాకర్ డైరెక్టర్లు మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్, భక్త మార్కండేయ, పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జిల్లా మనోహర్, కార్యదర్శి గంజి వెంకటేశం, కుల పెద్దలు సంగిశెట్టి మనోహర్, గుజ్జరీ యాదగిరి, చెరుపల్లి గోవర్ధన్, సూరేపల్లి సూర్యనారాయణ, గంజి గోవర్ధన్, గంజి అంజయ్య, ఆనంద వెంకటేశం, తడక మురళి, గంజి యాదగిరి, వనం దశరథ, హరికృష్ణతో పాటు పలువురు చేనేత కార్మికులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.