ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు
ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు
రామన్నపేట సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎం.డి. ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని రామన్నపేట ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఏటెల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద ఇబ్రహీం చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రెస్క్లబ్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాత్రికేయ రంగంలో ఇబ్రహీం విశేష కృషి చేశారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి అప్పం చెన్నకేశ్వర్, గౌరవ సలహాదారులు భైరబోయిన రమేష్, బూరుగు వెంకటేశం, సభ్యులు లవణం చంద్రశేఖర్, జీనుకల శ్రీను, లవణం ఉపేందర్, బత్తుల గణేష్, నోముల శంకర్, కైరంకొండ సంతోష్, సంగీశెట్టి పాండు, వీరమళ్ల రమేష్తో పాటు వివిధ పార్టీల నాయకులు కూనూరి సాయికుమార్, నకిరేకంటి మొగులయ్య, పోచబోయిన మల్లేశం, బందెల రాములు, సాల్వర్ అశోక్, ఎం.డి. జమీరుద్దీన్, ఎం.డి. అక్రమ్, మొటే రమేష్, బొడ్డు సురేందర్, కందుల హన్మంతు, బొడ్డుపల్లి లింగయ్య, ఇన్నాయత్ బైగ్, పల్లపు రవి, దావునూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.