ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:
నిర్మాణాలు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి వి. వినోద్ కుమార్ అన్నారు.
చిట్యాల మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో శనివారం మండల ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని గుండ్రంపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి గ్రామ పంచాయతీలలో పర్యటించిన ఆయన, నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం, కేంద్రాల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమానికి చిట్యాల ఎంపీడీఓ జీ . పాండు, ఎంపీఓ ఏ కొటేష్, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.