ఇంటి అనుమతికి రూ.13 వేలు డిమాండ్....
ఇంటి అనుమతికి రూ.13 వేలు డిమాండ్.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో మరో ప్రభుత్వ ఉద్యోగి చిక్కారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఆమెను పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన ఘటన జన్నారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.