జానకిరెడ్డి మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
జానకిరెడ్డి మృతి విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జానకిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జానకిరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
జానకిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.