జయపురంలో టీడీపీ సీనియర్ నేత కొల్లి వరప్రసాద్ రావు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జయపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొల్లి వరప్రసాద్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
కొల్లి వరప్రసాద్ రావు తండ్రి మాధవరావు కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
కొల్లి వరప్రసాద్ రావు మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జయపురం గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.