BREAKING
మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
www.ntodaynews.com

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
10 May, 2026 - 11:32 AM
52 వీక్షణలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

మైనర్ బాలిక ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం

హైదరాబాద్ 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరధ్పై మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదైనట్లు సమాచారం. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. అలాగే వేధింపులు భరించలేక తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కాలేజ్ ర్యాగింగ్ ఘటనలో బండి సాయి భగీరధ్ పేరు వినిపించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోపణలపై బండి సాయి భగీరధ్ లేదా కుటుంబ సభ్యుల స్పందన ఇంకా వెలువడలేదు.

పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.