BREAKING
కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి
www.ntodaynews.com

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
10 May, 2026 - 11:32 AM
65 వీక్షణలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

మైనర్ బాలిక ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం

హైదరాబాద్ 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరధ్పై మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదైనట్లు సమాచారం. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. అలాగే వేధింపులు భరించలేక తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కాలేజ్ ర్యాగింగ్ ఘటనలో బండి సాయి భగీరధ్ పేరు వినిపించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోపణలపై బండి సాయి భగీరధ్ లేదా కుటుంబ సభ్యుల స్పందన ఇంకా వెలువడలేదు.

పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.