BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

కష్టజీవుల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే : చెరుపల్లి సీతారాములు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Aug, 2026 - 06:13 PM
83 వీక్షణలు

కష్టజీవుల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే : చెరుపల్లి సీతారాములు

కష్టజీవుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన కామ్రేడ్ నారబోయిన సత్తమ్మ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడే పాలక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిట్యాల రైస్‌మిల్లు డ్రైవర్లు, కార్మికుల హక్కుల కోసం తన భర్త నారబోయిన భిక్షమయ్యతో కలిసి సత్తమ్మ ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, సరోజ, మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, ఐతరాజు యాదయ్య, అక్కెనపల్లి నాగయ్య, బూర్గు కృష్ణవేణి, చింతపల్లి కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం, జిల్లా నాయకులు దండెంపల్లి సత్తయ్య, రమేష్, నారబోయిన శ్రీను, మమత తదితరులు పాల్గొన్నారు.