BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మల్లెల శివారులో జూద శిబిరంపై తిరువూరు పోలీసుల మెరుపు దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:16 PM
28 వీక్షణలు

ఆరుగురు అరెస్టు.. రూ.16,650 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మల్లెల గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూద శిబిరంపై తిరువూరు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టానికి విరుద్ధంగా నగదు పణంగా కోతముక్క జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శాతకర్ణి సిబ్బందితో కలిసి ఆదివారం మధ్యాహ్నం మల్లెల గ్రామ శివారులో ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.16,650 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జూదాలకు దూరంగా ఉండాలి: పోలీసులు

ప్రభుత్వం నిషేధించిన జూద కార్యకలాపాల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. జూదాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ జూద కార్యకలాపాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.