www.ntodaynews.com
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మండల, కార్పొరేషన్ ఇన్-ఛార్జ్ల నియామకం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మండల, కార్పొరేషన్ ఇన్-ఛార్జ్ల నియామకం
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు నూతన ఇన్-ఛార్జీలను నియమించారు. ఈ నియామకాల్లో భాగంగా కార్పొరేషన్ ఇన్-ఛార్జీలుగా వేణు, శారద, బొల్లం భీమయ్య, సంధ్యారాణి, మరియు కళావతిలను ఎంపిక చేయగా, హాజీపూర్ మండల ఇన్-ఛార్జ్గా రేణిగుంట రమేష్ బాధ్యతలు చేపట్టారు. నియమితులైన ఇన్-ఛార్జీలు వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి బూత్ లెవల్ నుండి గ్రామ, మండల మరియు పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని, పార్టీ అభివృద్ధికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు