తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
మృతుడు బంటి కుమార్ (26)గా గుర్తించారు. అతడు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లా దేనాపూర్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందినవాడు. ఉపాధి కోసం తాతకుంట్ల గ్రామానికి వచ్చి, 2026 మే 17 నుంచి స్థానిక రైతు వడ్లమూడి చెన్నారావు వద్ద గేదెల షెడ్డులో నెలకు రూ.20 వేల జీతంతో పనిచేస్తున్నట్లు సమాచారం.
అయితే మే 31 రాత్రి సుమారు 10 గంటల సమయంలో బంటి కుమార్ తన అన్నతో పాటు ఇతర బంధువులతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అనంతరం జూన్ 1 ఉదయం అతడు నివసిస్తున్న రేకుల షెడ్ తలుపులు తెరిచి చూడగా లోపల ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విస్సన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)కి తరలించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు.