BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 01 June 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:05 PM
168 వీక్షణలు

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

మృతుడు బంటి కుమార్ (26)గా గుర్తించారు. అతడు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లా దేనాపూర్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందినవాడు. ఉపాధి కోసం తాతకుంట్ల గ్రామానికి వచ్చి, 2026 మే 17 నుంచి స్థానిక రైతు వడ్లమూడి చెన్నారావు వద్ద గేదెల షెడ్డులో నెలకు రూ.20 వేల జీతంతో పనిచేస్తున్నట్లు సమాచారం.

అయితే మే 31 రాత్రి సుమారు 10 గంటల సమయంలో బంటి కుమార్ తన అన్నతో పాటు ఇతర బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అనంతరం జూన్ 1 ఉదయం అతడు నివసిస్తున్న రేకుల షెడ్ తలుపులు తెరిచి చూడగా లోపల ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విస్సన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి తరలించారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు.