BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:05 PM
133 వీక్షణలు

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

మృతుడు బంటి కుమార్ (26)గా గుర్తించారు. అతడు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లా దేనాపూర్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందినవాడు. ఉపాధి కోసం తాతకుంట్ల గ్రామానికి వచ్చి, 2026 మే 17 నుంచి స్థానిక రైతు వడ్లమూడి చెన్నారావు వద్ద గేదెల షెడ్డులో నెలకు రూ.20 వేల జీతంతో పనిచేస్తున్నట్లు సమాచారం.

అయితే మే 31 రాత్రి సుమారు 10 గంటల సమయంలో బంటి కుమార్ తన అన్నతో పాటు ఇతర బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అనంతరం జూన్ 1 ఉదయం అతడు నివసిస్తున్న రేకుల షెడ్ తలుపులు తెరిచి చూడగా లోపల ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విస్సన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి తరలించారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు.