BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:05 PM
8 వీక్షణలు

తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

మృతుడు బంటి కుమార్ (26)గా గుర్తించారు. అతడు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లా దేనాపూర్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందినవాడు. ఉపాధి కోసం తాతకుంట్ల గ్రామానికి వచ్చి, 2026 మే 17 నుంచి స్థానిక రైతు వడ్లమూడి చెన్నారావు వద్ద గేదెల షెడ్డులో నెలకు రూ.20 వేల జీతంతో పనిచేస్తున్నట్లు సమాచారం.

అయితే మే 31 రాత్రి సుమారు 10 గంటల సమయంలో బంటి కుమార్ తన అన్నతో పాటు ఇతర బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అనంతరం జూన్ 1 ఉదయం అతడు నివసిస్తున్న రేకుల షెడ్ తలుపులు తెరిచి చూడగా లోపల ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విస్సన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి తరలించారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు.