కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి..
కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి..
అన్నమయ్య జిల్లా..
మదనపల్లి...
అక్రమంగా మా పొలము ఆక్రమించుకొన్నారు.
రాత్రి కి రాత్రి గుడి నిర్మించి మా భూమి ని అక్రమంగా సొంతం చేయడానికి ప్రయత్నం..
అన్నమయ్య జిల్లా, పీలేరు మండలం బెస్తపల్లి,శివరాంపురం,దొడ్డిపల్లి కి చెందిన నౌనిహర్ భూమి ని నాలెవాండ్లపల్లి,హరిజనవాడ కాలనీ, బాలం వారి పల్లి, పంచాయతీ, రేగల్లు గ్రామం, సర్వే నెంబరు S. నా భార్య పై 209 1/E 25.3.1992 1.171/2 భూమి కొన్నాము, మా పొలమునందు నాలెవాండ్లపల్లి హరిజనవాడ కాలనీ లో నివాసముంటున్న హరికృష్ణ, భాస్కర,నాగరాజు,రమణ,నాగేంద్ర శ్రీను, హరి, శేఖర, చిన్నబ్బా, విజయ, రవి, రాజన్న మా పొలాన్ని ఆక్రమించి అందులో బోరు,మోటార్ షెడ్డు తో పాటు మే 25 న రాత్రి కి రాత్రి కొత్తగా ఒక గుడిని కట్టడం జరిగింది. పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు స్థలం లోకి వెళ్ళకూడదు అని చెప్పినా కూడా తిరిగి రెండు రోజుల తర్వాత రాత్రి గుడిని కట్టడం జరిగింది,గడిచిన ఒక ,సంవత్సర కాలం నుంచి చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఇది మా పొలం, మాకు పట్టా, డాక్యుమెంట్స్ 1B కూడా ఉన్నాయని అన్ని పత్రాలు చూపినా వినకుండా మాపై దౌర్జన్యంగా,దుర్భాషలాడి SC,ST చట్టం కింద కేసు బుక్ చేస్తామని, ఆడవారు అని కూడా కనికరం లేకుండా నన్ను నా కుటుంబ సభ్యులను తోసి వేయడం జరిగింది,గుడిని తోసేస్తే మిమ్మల్ని చంపేస్తా మంటూ,చేతులు నరికేస్తామని,భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు,మా పొలంలోని వరిగడ్డిని కూడా కాల్చివేశారు,మా సమస్య ను గురించి తహసీల్దార్ మరియు పోలీసులకు పిర్యాదు చేసిన ఏమాత్రం మాకు న్యాయం చేయడానికి ముందుకు రాలేదని కలెక్టర్ వారు మా భూమి ని మాకు ఇప్పించాలని పిర్యాదు చెశామన్నారు.