BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

నిద్రమత్తు తెచ్చిన ముప్పు : తిరుమలగిరిలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ !

తెలంగాణ
/ తెలంగాణ / యాదాద్రి భువనగిరి
27 Jun, 2026 - 09:27 PM
163 వీక్షణలు

నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ అదుపు తప్పడంతో లారీ ఓ ఇంటిపైకి దూసుకెళ్లిన ఘటన తిరుమలగిరి మండలంలో శనివారం చోటుచేసుకుంది. వలిగొండ–తొర్రూర్ 960(పీ) జాతీయ రహదారిపై జలాల్‌పురం సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద తమిళనాడు రాష్ట్రానికి చెందిన TN 20 BS 0268 లారీ అతివేగంగా అదుపు తప్పి డబ్బా వెంకన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ఇంటి గోడలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు కిరాణా సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో తనకు సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకన్న తెలిపారు.

ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.