నిప్పుల కొలిమిలా తెలంగాణ NTODAY NEWS హైదరాబాద్
40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
*రాబోయే 3 రోజులు అత్యంత కీలకం
తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో ఉడికిపోతోంది. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత 'రెడ్ అలర్ట్' స్థాయికి చేరుకుంది. రాబోయే 14, 15, 16 తేదీల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. బిప్రజలకు సూచనలు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ మరియు ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.