నూజివీడులో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు
నూజివీడులో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొని ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. చాట్రాయి మండలం నుంచి నేతలు, దేశిరెడ్డి రాఘవరెడ్డి, పుచ్చకాయల సుబ్బారెడ్డి,పరసా చెన్నా రావు, మోరంపూడి నాగేశ్వర రావు, గడ్డం లోకేశ్వర రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.