www.ntodaynews.com
నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారధి అభివృద్ధి పనుల పరిశీలన..
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారధి అభివృద్ధి పనుల పరిశీలన.. శానిటేషన్ వాహనాల ప్రారంభం
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం నూజివీడు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శానిటేషన్ వాహనాలను మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.